ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'పుష్పక విమానం' సినిమాకి విజయ్ దేవరకొండ ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడని అందరికి తెలుసు.గోవర్ధన్ రావు దేవరకొండ మరియు విజయ్ దషి అలాగే ప్రదీప్ ఎర్రబెల్లి కలిసి నిర్మిస్తోన్న ఈ మూవీతో డైరెక్టర్‌గా దామెదర పరిచయం అవుతున్నాడని తెలుస్తుంది.

గీత్ సైని మరియు సాన్వే మేఘన హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోందని తెలుస్తుంది. 'దొరసాని', 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మూవీస్ తర్వాత ఆనంద్ నటించిన 'పుష్పక విమానం'పై ఇప్పుడిప్పుడే అంచనాలు పెరుగుతున్నాయని ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దేవరకొండ బ్రదర్స్ ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారని సమాచారం.దీనికి సంబంధించిన ప్రోమోను తన యూట్యూబ్ చానల్‌లో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడని తెలుస్తుంది.

ఇందులో తనదైన స్టైల్‌లో అతను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయని సమాచారం.. ప్రోమో మొదట్లోనే "పెళ్లి కూడా వీడిదే ఫస్ట్ అయితది" అని తమ్ముడ్ని ఉద్దేశించి చెప్పాడట విజయ్‌. అయితే అన్నదే మొదట అవుతుందన్నట్లు అతడి వైపు వేలు చూపించాడట ఆనంద్‌ దేవరకొండ ఏ విషయం ప్రస్తావనకు వచ్చిందో తెలీదు కానీ, "ఇట్లాంటి రిస్కులన్నీ నామీద పెడతాడు" అన్నాడు అన్నను ఉద్దేశించి అన్నాడట ఆనంద్‌.

"రెండు నెలలు హాలిడేస్‌కు ఇంటికి రాగానే చుక్కలు చూపించెటోడు" అని ఆనంద్ గురించి చెప్పాడని తెలుస్తుంది విజయ్‌. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఆనంద్ యు.ఎస్‌.లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడని సమాచారం. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ ఒకరి గురించి మరొకరు చాలా విషయాలే బయట పెట్టుకున్నట్లు సమాచారం. దాంతో పాటు ఆ బ్రదర్స్ మధ్య అనుబంధానికి ఈ ఇంటర్వ్యూ అద్దం పడుతుందని కూడా ఆశించవచ్చని తెలుస్తుంది. 25న ఫుల్ ఇంటర్వ్యూ మన ముందుకు రానున్నట్లు సమాచారం.ఇక  విజయ్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటి కే విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: