మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలో తేజు కి ఆక్సిడెంట్ జరిగింది. దాదాపు నెల రోజుల పాటు అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తరువాత సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు ఈ మెగా హీరో. ఇక అప్పటి నుంచి ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆక్సిడెంట్ తర్వాత మొట్టమొదటి సారి మీడియా ముందుకు రానున్నాడు సాయి తేజ్. గత కొద్ది రోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో సాయి ధరంతేజ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత కేవలం ఫోటోల  వరకే పరిమితమైన తేజు..

 ఇప్పుడు మొదటిసారి మీడియా ముందుకు రానున్నాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' సినిమా శాటిలైట్ మరియు ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా రిపబ్లిక్ ప్రీమియర్స్ కి సంబంధించి చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించబోతోంది. ఈ ప్రెస్ మీట్ కీ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా హాజరు కానున్నారని చిత్ర బృందం తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే రేపు ఈ ప్రెస్ మీట్ ని చిత్ర యూనిట్ నిర్వహించబోతున్న ట్లు సమాచారం. ఇక ఆక్సిడెంట్ తర్వాత మొదటిసారి సాయిధరమ్ తేజ్ మీడియా ముందుకు రాబోతూ ఉండడంతో ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఈ ప్రెస్ మీట్ లో దొరికే అవకాశాలు ఉన్నాయి.

సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలోనే రిపబ్లిక్ సినిమా విడుదలైంది. అయితే తేజు ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. అందుకోసమే చిత్ర యూనిట్ ఈ ప్రెస్ మీట్ కి సాయి తేజ్ ని ఆహ్వానించగా తేజు ఈ ప్రెస్ మీట్ కి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కారణాలను ఈ ప్రెస్ మీట్లో తేజు వెల్లడిస్తారని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మరోవైపు యాక్సిడెంట్ తర్వాత తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడో చూడాలని ఈ ప్రెస్ మీట్ కోసం కొంత మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: