పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ జంటగా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. కొద్ది రోజులుగా వివాహ జీవితం తర్వాత తన వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.. పరస్పర అంగీకారంతో చట్టపరంగా ఇద్దరు భార్య భర్తల విడిపోయి దూరంగా ఉన్నప్పటికీ వీరి పిల్లల కోసం అన్ని పక్కన పెట్టేసి కలుస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కుదిరినప్పుడల్లా రేణుదేశాయ్ ఇంటికి వెళ్లి పిల్లలతో తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు ఆ మధ్య రేణు దేశాయ్ ఇంట్లో పవన్ తన పిల్లలతో ప్రేమగా ఉన్నటువంటి ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలా వైరల్ గా మారింది.

ఒక రేణు దేశాయ్ సైతం తన పిల్లలను మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగానే ఉంచేలా చూస్తోంది. మెగా కుటుంబంలో జరిగే అన్ని వేడుకలకు పండుగలకు అకీరా అధ్యాయాలను పంపిస్తూ ఉన్నది. అయితే పవన్ రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్లో కలిసి కనిపించిన సందర్భాలు ఎక్కడా లేవు. కేవలం సినిమా పోస్టర్ లోనే తప్ప రియల్ గా వీరు కలిసి దిగిన ఫోటోలు ఎప్పుడూ కూడా బయటికి రాలేదు. అయితే అలాంటి సందర్భమే ఇప్పుడు ఒకటి వచ్చినది.

అఖిరా నంద న స్కూల్ గ్రాడ్యుయేషన్ డే లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్న అకీరా తాజాగా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడంతో అందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా నిన్నటి రోజున జరిగాయి. ఈ ఈ సెలబ్రేషన్స్కు తల్లిదండ్రులుగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ హాజరవడం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ కీరా అధ్యాయాలతో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఒక పిక్ వైరల్ అవుతోంది. రేణు దేశాయ్ స్వతహాగా తన ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోని షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: