దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం యూనివర్సల్ సబ్జెక్టుని ఎంచుకున్నట్లుగా కథలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో విజయ్ ని ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా రష్మి క నటిస్తున్నది. ఇక ప్రభు ,శరత్ కుమార్, జయసుధ శ్రీకాంత్ ,యోగిబాబు , సంగీత తదితరులు కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఇక విజయ్ నటించిన గత చిత్రం బీస్ట్ చిత్రం భారీ డిజాస్టర్ ని చవిచూసింది దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చందారు. మరి వారసుడు సినిమాతోనైనా అభిమానులను విజయ సంతృప్తి పరుస్తాడేమో చూడాలి. వారసుడు సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ.100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి.