మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి బాబీ దర్శకత్వంలో తేరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీcప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో చిరంజీవి మరియు రవితేజ మధ్య అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు మరియు ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాబీ సింహ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీని ఇప్పటివరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి బాస్ పార్టీ అనే సాంగ్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ మూవీ లో స్పెషల్ సాంగ్ గా రాబోతుంది. ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవి తో పాటు ఊర్వసి రౌటెలా స్టెప్పులు వేసింది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ కి ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ పాట ఇప్పటివరకు యూట్యూబ్ లో 20 మిలియన్ ల వ్యూస్ ను , 393 లైక్ లను సాధించింది ఇలా ఈ మూవీ లోని బాస్ పార్టీ సాంగ్ కు ప్రస్తుతం యూట్యూబ్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: