మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగ చెప్పినవసరం లేదు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మభూషణ్ అవార్డు దక్కింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు అందరూ ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలుపుతున్నారు. అయితే తాజాగా దర్శక దీరుడు రాజమౌళి సైతం తనదైన శైలిలో చిరంజీవికి పద్మభూషణ్ అందుకున్న కారణంగా అభినందనలను తెలిపారు. దాంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా అవుతుంది.  'ఎక్కడి నుంచో, వచ్చి..పునాదిరాళ్లకు మొదటి రాయి వేసిన ఒక కుర్రాడు..

భారతదేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం గ్రహీతగా నిలిచారు. మీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది మెగాస్టార్ చిరంజీవి  గారూ'..అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే మరొకవైపు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సైతం అభినందనలు తెలుపుతున్నారు. నటుడిగా రాజకీయ నాయకుడిగా సమాజసేవకుడిగా ఇప్పటికే ఎందుకు సహాయ సహకారాలను అందించిన చిరంజీవికి ఈ అవార్డు రావడంతో మెగా అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి   68 ఏళ్ళ వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్‌ నింపుతున్నారు. 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు మల్లిడి వశిష్టతో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి  . రాజమౌళి విషయానికి వస్తే..బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చి..పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి..మహేష్తో భారీ బడ్జెట్ తో హై-వోల్టేజ్ యాక్షన్‌ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కిస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: