యాంకర్ కర్ శ్రీముఖి ని హీరోయిన్ శ్రీముఖి గా చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. అయితే ఆమె సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది.యంగ్ బ్యూటీ శ్రీముఖి ఇంకా బుల్లితెర అందాల యాంకర్ గానే కొనసాగుతోంది. తనకున్న టాలెంట్ కు ఎప్పుడో హీరోయిన్ గా కావాల్సిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ స్మాల్ స్క్రీన్ కే పరిమితమైంది. యాంకర్ శ్రీముఖి కెరీర్ 'పటాస్' కామెడీ షోతో ప్రారంభమైన విషయం తెలిసిందే.ఇలా తొలి షోతోనే టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తక్కువ కాలంలోనే శ్రీముఖి స్టార్ యాంకర్ గా బుల్లితెరపై అవతరించింది. ప్రస్తుతం వరుస పెట్టి షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ టీవీ షోలతో అదరగొడుతోంది. మరింతగా అభిమానులను సంపాదించుకుంటోంది.అయితే, శ్రీముఖి యాంకర్ కంటే ముందుగానే నటిగా పలు సినిమాల్లో మెరిసింది. హీరోయిన్ గానూ తెలుగులో ఒక సినిమా చేసింది. 'ప్రేమ ఇష్క్ కాదల్' అనే చిత్రంలో హీరోయిన్ గా తొలిసారి నటించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'క్రేజీ అంకుల్స్' పరిస్థితి కూడా అంతే..ఇక... జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నేను శైలజా, జెంటిల్ మెన్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, మ్యాస్ట్రో' వంటి చిత్రాల్లో సోపర్టింగ్ రోల్స్ నటించింది. అయితే.. ఓవైపు అనసూయ, రష్మి గౌతమ్, బిగ్ బాస్ నుంచి వచ్చిన వారు కూడా హీరోయిన్లుగా అవకాశాలు అందుకుంటున్నారు.కానీ శ్రీముఖి మాత్రం ఇంకా యాంకర్ గానే కెరీర్ ను లీడ్ చేస్తోంది. హీరోయిన్ గా సినిమాల్లో సక్సెస్ కాలేకపోతోంది. దీనికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. అందేంటో కాదు.. శ్రీముఖి సినిమాల కంటే.. టీవీ షోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.ఈ విషయాన్ని కూడా శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తను ఎక్కువగా టీవీ షోలకే ప్రాధాన్యత ఇస్తున్నానని, అదే ముఖ్యమని.. ఇక సమయం ఉన్నప్పుడే సినిమాలు చేస్తున్నానని చెప్పారు. కానీ శ్రీముఖి ఫుల్ టైమ్ ప్రయత్నాలు చేస్తే మాత్రం యాంకర్ నుంచి హీరోయిన్ శ్రీముఖిగా మారుతుందని ఆమెను అభిమానించే వారు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: