ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన ప్రియమణి ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూనే ఇంకోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వైవిద్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తూ ఉంది. అయితే కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.



 గత ఏడాది షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ అనే సినిమాలో కీలకపాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు మైదాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఇటీవల ముంబై బీటౌన్ సెలబ్రిటీల కోసం మైదాన్ స్క్రీనింగ్ జరిగింది. ఈ సమయంలో సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బోనీ కపూర్ సహా చిత్ర యూనిట్ అంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్లో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ప్రియమణి చీరకట్టులో ఎంతో అందంగా కనిపించింది.


 అయితే ఈవెంట్లో ఏకంగా ప్రియమణితో  స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ కాస్త అనుచితంగా ప్రవర్తించాడు అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్క్రీనింగ్ థియేటర్ వెలుపల అతిథులతో బోనీకపూర్ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి ప్రియమణి వచ్చింది. అయితే ఆమెకు స్వాగతం పలికిన భోని కపూర్.. ఫోటోగ్రాఫర్ పోజులు ఇవ్వమని అడగడంతో ప్రియమణితో కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే బోని ప్రియమణి భుజం సహా నడుముపై చేయి వేయడం కూడా ఈ ఫోటోలలో కనిపిస్తుంది. అయితే ఇది అటు అభిమానులకే కాదు నైటిజన్స్ కి కూడా అసలు నచ్చడం లేదు. ఏకంగా ప్రియమనిని బోనీకపూర్ అనుచితంగా తాకినట్లు సోషల్ మీడియా జనాలు విమర్శలు చేస్తున్నారు. అయితే మహిళలను బోనికపూర్ అనుచితంగా  తాకాడు అంటూ అతన్ని నెటిజన్స్ విమర్శించడం కొత్తేమి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: