
“గత అనుభవాల ప్రకారం రాజమౌళి సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేస్తారు” అని అనుకున్నారు జనాలు. కానీ రాజమౌళి మాత్రం అలాంటి పనిలో ఉండడం లేదు. ఈ సినిమా షూటింగ్ను ఆలస్యం అవుతుంది. కేవలం లుక్స్ కి ప్రాధాన్యం ఇచ్చి, దాదాపు 365 రోజులు టైం దీనికే కేటాయించారు. దీని బట్టి చెప్పేయొచ్చు రాజమౌళి ఈ సినిమాపై ఎంత ఆశలు పెట్టుకున్నారో అనేది. అదే విధంగా, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఓపికతో వెయిట్ చేస్తున్నారు. అయితే, రాజమౌళి చేస్తున్న ఓ “బిగ్ మిస్టేక్” సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా, “ఎప్పుడైనా సరే ఏ రోల్ కి ఎవరు సెట్ అవుతారు, సూట్ అవుతారు” అని పక్కాగా ఆలోచించి ముందుకు వెళ్ళే రాజమౌళి, ఈ విషయంలో తడబడినట్టే కనిపిస్తోంది.
దాంతో, ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్న ప్రియాంక చోప్రాను సెకండ్ లీడ్ గా మార్చారట. ఇప్పుడు, ఓ స్టార్ హీరోయిన్ సినిమా లో మెయిన్ లీడ్ గా తీసుకురావడం పై ఫోకస్ పెట్టిన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా–మహేష్ బాబు మధ్య తెరకెక్కించిన సీన్స్ పక్కన పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త హీరోయిన్ వస్తే, మళ్లీ ఆ సీన్స్ రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది. జనాలు దీనిని టైం వెస్టు, డబ్బు వెస్టు అని అంటున్నారు. “రాజమౌళి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?” అనే విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూట్ ఆలస్యంగా జరుగుతుందని ఊహించిన సమయంలో, ఒక హీరోయిన్తో సీన్స్ పూర్తి కాకుండా మరొక హీరోయిన్ తీసుకురావడం, ఆ సీన్స్ మళ్లీ షూట్ చేయించుకోవడం ఎంతవరకు సరైనది అని విమర్శిస్తున్నారు. చిత్ర బృందం ఈ విషయంపై ఎటువంటి ఆఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినా, సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ కూడా చిత్ర బృందం ఎలా స్పందిస్తారు అనేది వెయిట్ చేస్తున్నారు. “రాజమౌళి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తే బెటర్, లేకపోతే ఆయన ఇమేజ్ కు దెబ్బతగలవచ్చు" అంటూ సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు..!!