హీరో తేజ సజ్జా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రితిక నాయక్, మంచు మనోజ్ , శ్రియ, జగపతిబాబు తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా మంచు మనోజ్ ఇందులో విలన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మీరాయ్ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం ట్రైలర్ కూడ విడుదల చేసింది.


ట్రైలర్ విషాయనికి వస్తే..
ఈ ప్రమాదం ప్రతి గ్రంధాన్ని చేరబోతోందనే డైలాగ్ తో మొదలవుతుంది.. తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చిన తర్వాత..మంచు మనోజ్ ముఖాన్ని చూపిస్తారు. జగపతిబాబు తో పాటుగా, శ్రియ పాత్ర కూడా ఇందులో కీలకంగా ఉండనుంది.హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ తో పాటుగా మంచు మనోజ్ విలన్ గా అదరగొట్టేసారని ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. మంచు మనోజ్ కు కూడా ఇందులో ఏవో శక్తులు ఉన్నట్టుగా చూపించారు. అలాగే తొమ్మిది గ్రంధాలను దొరకకుండా కాపాడుతూ ఉంటే వాటిని అందుకోవాలని విలన్ (మంచు మనోజ్) ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మీరాయ్ అనే ఆయుధంతో హీరో ఎలా ఆపుతారు? అనే కథాంశంతో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. గ్రాఫిక్స్ కూడా హైలెట్ గా కనిపిస్తోంది. తేజ సజ్జా , గరుడ మధ్య వచ్చే సన్నివేశం కూడా హైలెట్గా కనిపిస్తోంది



మీరాయ్ అనే సినిమా మైథాలాజికల్ టచ్ చేసినట్లుగా కనిపిస్తోంది. చివరిలో శ్రీరాముడు గెటప్పులో వచ్చిన సీన్ హైలెట్గా కనిపిస్తోంది ట్రైలర్లో. మరి శ్రీరాముడు గెటప్ లో కనిపించింది ఎవరనే విషయం సస్పెన్స్ గానే చూపించారు. సెప్టెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా లేవల్లో రాబోతోంది. ప్రస్తుతం అయితే ట్రైలర్ మాత్రం అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ సినిమా కూడా హిట్ కొట్టాలా కనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: