టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలోనే రౌడీ జనార్ధన్ అనే ఒక పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ రవి కిరణ్ కోలా డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసినట్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ చిత్రం కోసం చిత్ర బృందం విలన్ క్యారెక్టర్ కోసం ఒక స్టార్ హీరోని దింపే ప్రయత్నం చేస్తున్నారు.



ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హీరో రాజశేఖర్ ని, విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా నటించడానికి సంప్రదించినట్లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కథ చర్చలు జరగగా రాజశేఖర్ కూడా ఇందులో నటించడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ఇంకా అధికారికంగా చిత్ర బృందం ప్రకటించలేదు. కానీ టాలీవుడ్ లో ఈ సినిమా గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ ఇందులో ఒక సీరియస్ రోల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు.


విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ చిత్రానికి రాజశేఖర్ పర్ఫెక్ట్ విలన్ గా సరిపోతారని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి అక్టోబర్ రెండవ తేదీ నుంచి సినిమా షూటింగ్ మొదలుపెట్టేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ దశ తిరుగుతుందేమో చూడాలి మరి. ఈ ఏడాది విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. మరి ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: