ఇప్పుడో మరోసారి ఆలీ కథానాయకుడిగా పెదరావురు ఫిలిం సిటీ పతాకం పై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా ‘పండుగాడి ఫోటోస్టూడియో’ చిత్రం రూపొందుతోంది. ‘వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది’ అనేది ఉప శీర్షికతో చిత్ర నిర్మాణం జరుగుతోంది. దిలీప్ రాజా దర్శకత్వంలో వెంకట సాంబిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దాాదాపు పూర్తి స్థాయిలో చిత్రీకరణ చేసుకుంది.
ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ.. ‘ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓకే చేసిన కథ ఇది. ఈ చిత్రంలో హీరోకు 40 సంవత్సరాల వయసు వచ్చే వరకూ పెళ్లికాదని నాగ దేవత శాపం ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడటం, మరోపక్క శాపం వల్ల జరిగే పరిణామాలే ఈ చిత్ర కథాంశం. పూర్తి హాస్యభరిత చిత్రమిది. 1150 చిత్రాల్లో నటించిన ఆలీ ఈ చిత్రంలో హీరోగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. హీరోయిన్గా రిషిత వెండితెరకు పరిచయం కాబోతోంది.
కుటుంబ సభ్యులతో కలిసి కడుపుబ్బా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందిని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో వినోద్ కుమార్ ,బాబు మోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి రామ్ జగన్ లాంటి సీనియర్ నటులతో పాటు విలక్షణమైన పాత్రల్లో సందీప్ రాజా, టీనాచౌదరి తొలి పరిచయం కానున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాన్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.