యువ హీరో నితిన్ శ్రీనివాస కళ్యాణం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈమధ్యనే వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా మొదలు పెట్టిన నితిన్ కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న చంద్రశేఖర్ ఏలేటి సినిమా కూడా షురూ చేశాడు. మనమంతా సినిమా తర్వాత చంద్రశేఖర్ ఏలేటి చేస్తున్న సినిమా ఇదే అవడం విశేషం.


ఈమధ్య యువ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. వారికి తానేమి తక్కువ కాదని నితిన్ కూడా అదే పంథా కొనసాగిస్తున్నాడు. వెంకీ కుడుముల భీష్మ సినిమా ఇలా సెట్స్ మీదకు వెళ్లిందో లేదో ఈరోజు చంద్రశేఖర్ ఏలేటి సినిమా ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందట.   


నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భీష్మ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సో రెండు సినిమాల్లో ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ తో నితిన్ రొమాన్స్ చేస్తున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి సినిమాను ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది.  


ఈరోజు సినిమా ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకోగా త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందట. ఐతే సినిమా నుండి తన ప్రతి సినిమా చాలా డిఫరెంట్ గా చేస్తున్న చంద్రశేఖర్ ఏలేటి నితిన్ తో ఎలాంటి ప్రయోగాన్ని చేస్తున్నాడో చూడాలి. నితిన్ కాన్ఫిడెంట్ చూస్తుంటే 2020 తన సత్తా చాటేలా ఉన్నాడనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: