శివ సంగీతం అందించిన ఈచిత్రంలో మెగా ఆకాష్ కథానాయికగా నటించిన శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. ఈచిత్రానికి గౌతమ్ మీనన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది కానీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధ్రువ నక్షత్రం' మాత్రం ఇంకా నిర్మాణంలోనే వుంది. ఈసినిమా కూడా ఎప్పుడో విడుదలకావాల్సి వుంది కానీ ఆర్థిక సమస్యల వల్ల ఈ చిత్రాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. మరి ఈ సినిమాను కూడా గౌతమ్ మీనన్ ఎలాగోలా విడుదల చేసేలా చూస్తాడో లేక వదిలిపెట్టేస్తాడో చూడాలి.
ఇక ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో భాగంగా ఇటీవల వెట్రి మారన్ దర్శకత్వంలో 'అసురన్' అనే చిత్రాన్ని పూర్తి చేశాడు. ఈ చిత్రంలో ధనుష్ డ్యూయెల్ రోల్ లో నటిస్తుండగా మలయాళ నటి మంజు వారియర్ ఓ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ ప్రస్తుతం దొరై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో పటాస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం ప్రారంభం కాగా పంజాబీ బ్యూటీ మెహ్రీన్ ,ధనుష్ కు జోడిగా నటిస్తుంది. కాగా టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు.