వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. సోషల్ ఇంజనీరింగ్ను అత్యంత ఎక్కువ గానమ్మే జగన్.. అన్ని సామాజిక వర్గాలకు అంతులేని ప్రాధాన్యం కల్పించారు. జగన్ ప్రభుత్వంలో కానీ, ఆయన పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో కానీ... అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయ కులు ఉన్నారు. అదే సమయంలో పదవులు పొందిన వారిలోనూ అలాగే ఉన్నారు. నిజానికి జగన్ అధికా రంలోకి వస్తే.. రాష్ట్రంలో ఇంకేముంది.. రెడ్డి రాజ్యం వచ్చేస్తుంది.. ఎటు చూసినా..రెడ్లే కనిపిస్తారని.. చం ద్రబాబు ఎన్నికల సమయంలో చాపకింద నీరులాగా ప్రచారం చేశారు.
అంతేకాదు, జగన్ అధికారంలోకి వస్తే.. కమ్మ వర్గాన్ని తొక్కేయడం ఖాయమని కూడా చంద్రబాబు అండ్ తమ్ముళ్లు పెద్ద ఎత్తున యాంటీ ప్రచారం చేశారు. అయితే, దీనికి భిన్నంగా జగన్ అన్ని వర్గాలను ప్రాధా న్యంగా నే చూస్తున్నారు. ఇక యేడాది కాలంగా జగన్ కమ్మ వాళ్లను అడ్డంగా తొక్కేస్తున్నారంటూ పచ్చ మీడియా... బాబోరి టీం తెగ గగ్గోలు పెట్టేస్తోంది. ఇక, తనపై అపవాదు వేసేలా చంద్రబాబు చేసిన ప్రచారానికి చెక్ పెడుతూ.. క మ్మ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. తొలి కేబినెట్లోనే గుడివాడ ఫైర్ బ్రాండ్, కమ్మ వర్గానికి చెందిన కొడాలి నానికి మంత్రిగా అవకాశం కల్పించారు.
ఇక, విజయవాడకు చెందిన యువ నేత, టీడీపీ లో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న నాయకుడు, దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని అవినాష్ వైసీపీ తీ ర్థం పుచ్చుకోగానే ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ పగ్గాలు అప్పగించారు. రేపో మాపో అవినాష్ వైసీపీలో భవిష్యత్లో కీలకమైన యువనేతగా ఎదగనున్నారు. అసలు అవినాష్ టీడీపీలో ఉండి ఉంటే ఆ కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎప్పటకి ఎదుగు బొదుగు లేకుండా బాబోరు... జిల్లా టీడీపీ నేతల కుయుక్తులకే బలైపోయేవాడు. ఇక, పార్టీలో గెలిచిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్య చౌదరి(దెందులూ రు) రేపో మాపో జగన్ టీం కీలక మెంబర్ కానున్నారు.
ఇక పార్టీ నుంచి గెలిచిన కమ్మ ఎమ్మెల్యేల్లో అన్నాబత్తుని శివకుమార్(తెనాలి), బొల్లా బ్రహ్మనాయుడు(వినుకొండ), ఎంవీవీ సత్యనారాయణ (వైజా గ్ ఎంపీ), నంబూరు శంకర్రావు(పెదకూరపాడు ఎమ్మెల్యే), లావు శ్రీకృష్ణదేవరాయలు(నరసరావు పేట ఎంపీ), బాచిన కృష్ణచైతన్య(అద్దంకి వైసీపీ ఇంచార్జ్.. యువ నేత) ఇలా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నా యకులకు జగన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక చిలకలూరిపేటలో సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్కు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన జగన్... మండలి రద్దుకాకపోతే ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇవ్వనున్నారు.
ఇక, రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సాగడం లేదని.. జగన్ కమ్మ వాళ్లను తొక్కేందుకు రియల్ ఎస్టేట్ నాశనం చేస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇటీవల వైసీపీ యువ నేత దేవినేని అవినాష్తో కలిసి కొందరు సీఎం జగన్ అప్పాయింట్మెంట్ కోరారు. ఈ టీంలో విజయవాడకు చెందిన పలువురు కమ్మ ప్రముఖులు, పెద్దలు కూడా ఉన్నారు. రాజధాని ప్రాంతంలో మరో నాలుగైదు నెలల్లో చూడండి రియల్ ఎస్టేట్ ఎలా పుంజుకుంటుందో ? మీరే చూస్తారుగా.. ఇక్కడ రియల్ ఎస్టేట్ తో పాటు పరిశ్రమలు ఎలా వస్తాయో ? అని చెప్పడంతో పాటు మీరు ఏ పరిశ్రమలు పెట్టుకోవాలన్నా క్షణాల్లో అనుమతులు మంజూరు చేసే పూచీ నాది అని హామీ ఇచ్చారట.
దీంతో ఆ బెజవాడ కమ్మ పెద్దలు అందరూ జగన్ కమ్మలను తొక్కేస్తున్నాడని జరుగుతోన్న ప్రచారం వెనక చంద్రబాబు, ఎల్లో బ్యాచ్ బాగా పని చేస్తున్నారని అర్థం చేసుకున్నారట. వాస్తవంగా బాబోరి పాలనలో అడ్డగోలుగా వ్యవహరించి.. అవినీతి అక్రమాలకు పాల్పడని వారి బాగోతం బట్టబయలు చేయడమే తప్పా జగన్కు ఎవరిపై ఎలాంటి ఉద్దేశాలు లేవన్నది సుస్పష్టం.