ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు పై వేసిన సెటైర్ లకి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెగ మండి పడుతున్నారు. విజయ్ సాయి రెడ్డి ఈ విధంగా చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు.‘‘చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో తెలియదంట సంక్రాంతి సృష్టికర్తనని చెప్పుకునే బాబు గారికి. పైగా సారీ- పూర్తిగా మారిపోయానంటూ కొత్త డ్రామాలు మొదలెట్టారు. ఎన్నిసార్లు మారతారు బాబు గారూ? దేవాలయాలు ధ్వంసం చేస్తూ తన ఓటమికి ఇంకా ప్రజల్నే నిందిస్తున్నాడు’’ అంటూ చంద్రబాబుపై విజయసాయి సోషల్  మీడియాలో  సెటైర్లు  వేశారు.ఇంకా అంతటితో ఆగకుండా అలాగే తెలుగు దేశం పార్టీ నాయకులను కూడా టార్గెట్ చేశారు.

‘‘బాబు గారు సీఎంగా లేకపోవడం తెలుగుదేశం పార్టీ  తెలుగు దళారీ పార్టీ, బ్రోకర్లకు లోటే! ఆర్భాటాల్లేకుండా పెట్టుబడులు, కొత్త ప్రాజెక్టులు వెలువెత్తుతున్నాయి. కరోనాపై కరాటే లాంటి స్కీములు పెట్టి కోట్లు కొట్టేయకుండానే కోవిడ్ కంట్రోలవుతోంది. దళారులు లేకుండానే సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయి.’’ అని చంద్రబాబుపై విజయసాయి విమర్శలు సంధించారు.విజయ్ సాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకి టీడీపీ ఫ్యాన్స్ తెగ ఫైర్ అవుతున్నారు. ముందు మీ పని మీరు చూసుకోండి. తరువాత మిగతా వారిపై సెటైర్లు వెయ్యండి అంటూ విజయ్ సాయి రెడ్డి పై తీవ్రంగా కామెంట్స్ చేస్తూ మండిపడుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయాల గురించి అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: