ప్రజలు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కరోనా కట్టడికి లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదాయాన్ని సైతం పక్కన పెట్టి లాక్డౌన్ అమలు చేస్తున్నామని, అనవసరంగా రోడ్లపైకి ఎవరొచ్చినా సహించేది లేదని స్పష్టం చేశారు. అయితే ఇటువంటి సమయంలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానని అన్నారు. కోవిడ్ హాస్పిటళ్లలో సేవలందిస్తున్న అన్నిరకాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని.. ఇందుకోసం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. వైద్య సిబ్బంది ఇదే స్పూర్తిని కొనసాగించాలని సీఎం కేసీఆర్ కోరారు. కరోనా బాధితులను పరామర్శించేందుకు వరంగల్ ఎంజీఎంలో సీఎ కేసీఆర్ పర్యటించారు. ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది, నర్సులతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు చేస్తున్న సేవలను అభినందించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి