IMD : తెలంగాణ రైతులకు పిడుగులాంటి వార్త..అకాల వర్షాలు ఇప్పటికే రైతులను చాలా ఆగమాగం చేశాయి. ఇక అన్నదాతలు ఇంకా తేరుకోక ముందే, మరో పిడుగు లాంటి వార్త చెప్పింది ఐఎండీ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం చాలా ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.ఇక ఈనెల 21 దాకా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది. ఇవాళ చాలాచోట్ల ఉరుములు ఇంకా అలాగే మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు. అటు గంటకు 40 కిలోమీర్ల వేగంతో ఈదురుగాలులు అనేవి బాగా వీస్తాయని కూడా హెచ్చరించారు.అయితే, తెలంగాణలో వరి కోతలు అనేవి కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఈ టైంలో వర్షాలు కనుక కురిస్తే, నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. దేశంలోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రావడంతో ఆ ప్రభావం అనేది రాష్ట్రంపై ఉంటుందని అంచనా వేస్తున్నారు ఐఎండీ ఆఫీసర్లు. 



ఇక అండోమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు ఇంకా బంగాళాఖాతంలో మరింత చురుకుగా కదులుతున్నాయని, అండోమాన్‌ దీవులకు పూర్తిగా రుతువపనాలు విస్తరించాయని వారు చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో అండోమాన్‌ నికోబార్‌ దీవులు, కేరళ ఇంకా దక్షిణ కర్నాటక తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.తెలంగాణ ఇంకా తమిళనాడు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో అండోమాన్‌ నికోబార్‌ దీవులు సహా చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలకు ఇంకా అలాగే అండమాన్‌ సముద్రం ఇంకా అండమాన్‌ దీవులు మొత్తానికి, బంగాళాఖాతం తూర్పు మధ్య ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: