ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున నియమిస్తూ గ్రామ, వార్డు వాలంటరీలను సైతం నియమించడం జరిగింది.. దీంతో పాటు విపక్షాలు వాలంటీర్లను సైతం గతంలో టార్గెట్ చేస్తూ నాన హంగామ చేశారు.. అంతేకాకుండా వీరందరిని టార్గెట్ చేస్తూ పలు రకాల ఆరోపణలు చేయడం జరిగింది.. ఒకవేళ ఆంధ్రాలో అధికారం మారితే కచ్చితంగా వాలంటరీలను తొలగిస్తారని ప్రచారం కూడా ఎక్కువగా వినిపించింది.. ఇప్పటికే వాలంటరీలకు 5వేలకు పైగా గౌరవ వేతనం ఇస్తున్నారు.. ఇలా తక్కువ వేతనంతో పని చేస్తున్నప్పటికీ వాలంటరీలలో ఒక ఆందోళన నెలకొంది.


గతంలో పలు రకాల విమర్శలు చేసిన టిడిపి నేత చంద్రబాబు ఇప్పుడు రూటు మార్చి ఎన్నికలవేళ వాలంటరీలలో ఉన్న ఆందోళనను సైతం తొలగిస్తూ కీలకమైన హామీ ఇచ్చారు.. టిడిపి జనసేన ప్రభుత్వం చేపడితే వాలంటీర్లను కొనసాగిస్తామంటూ నిన్నటి రోజున పెనుగొండలో జరిగిన ఒక సభలో హామీ ఇచ్చారు.. వాలంటరీలు ఎవరిని ఉద్యోగాల నుంచి తొలగించమని అలాంటి ఆలోచన కూడా చేయమని తెలియజేశారు వారికి కచ్చితంగా న్యాయం చేస్తామంటూ వెల్లడించారు చంద్రబాబు..


వాలంటరీలు ఎవరూ కూడా వైసిపి పార్టీ కోసం పనిచేయదండి అంటూ సూచిస్తున్నారు.. ఇప్పటికే రాష్ట్రంలో వాలంటరీలు ఎన్నికల విధులలో జోక్యం చేసుకుంటున్నారంటూ వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు అంటూ వెల్లడించారు.. అటు టిడిపి జనసేన పార్టీలు ఇద్దరు కూడా ఈసీకి ఫిర్యాదులు చేశామని వెల్లడించారు.. దీంతో కలెక్టర్లు కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని కోరామంటూ తెలియజేశారు చంద్రబాబు.. అయితే గతంలో ఈ వాలంటరీలని అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇతరులకు ఇస్తున్నారని విధంగా తప్పుపట్టారు.. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం వాలంటరీలు అవసరం అని వీరిని మళ్లీ కలుపుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు.. మరి ఈ విషయం పైన వాలంటరీ వ్యవస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: