పొత్తుల విషయం ఏమో కానీ జనసేన బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు మాత్రం కొత్త సమస్యను  తెచ్చింది. ఒకవైపు జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పోరాటం చేయాలని ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది.అందులో భాగంగానే ప్రత్యామ్నాయ కూటమితో ప్రభుత్వాన్ని సిద్ధం చేయాలని పదేపదే పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రకటనను స్వాగతిస్తున్న జనసేన పార్టీ నేతలు.. బిజెపికి సీట్లు ఇచ్చేందుకు మాత్రం ఏమాత్రం ముందుకు రావడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున దాదాపు సీట్ల ఖరారు అనేది పూర్తయింది. అనుకున్న నియోజకవర్గాల్లో బిజెపి కోసం జనసేన పార్టీ సీట్లను త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం జరిగింది. అయితే దీనిపై ఇప్పుడు ఆ పార్టీ నేతలు అధినేత పవన్ కళ్యాణ్‎పై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు.


ఎన్నో అంచనాల మధ్య జనసేన పార్టీతో కలిసి ఇంతకాలం అడుగులు వేస్తే.. ఇప్పుడు బిజెపి కోసం తమను త్యాగాలు చేయమని కోరడం ఏంటని ఆ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి దాకా ప్రభుత్వంపై పెద్ద పోరాటాన్ని జనసేన పార్టీ తరఫున చేస్తే.. సీట్ల సర్దుబాటు పేరుతో పక్కనపెడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమైపోవాలి అంటూ ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీట్లు సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇటు పక్క పార్టీలోకి పోలేక అలా అని అధికార పార్టీలోకి వెళ్లలేక అయోమయ స్థితిలోకి ఉన్నారు జనసేన పార్టీలోని కొందరు నేతలు. ఇప్పుడు సీట్ల సర్దుబాటులో బిజెపి కోసం త్యాగాలు చేస్తే.. జనసేన పార్టీకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని అధినేత హామీ ఇచ్చినా కూడా.. బిజెపి తమకు ఎంత మేర నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది అనేది వారికి సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. రెండు పార్లమెంట్, అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో త్యాగాలు చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గాల్లో గెలుపు ఓటముపై జనసేన నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: