
గత సారి ఈ సీటు నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మాగంటి గోపీనాధ్ చేతిలో ఓడిపోయారు. అయితే ఈ సారి కాంగ్రెస్ టికెట్ రేసులో అజారుద్దీన్ పేరు వినిపించడం లేదు. కేవలం మూడు పేర్లు మాత్రమే హైకమాండ్కు వెళ్లగా, వాటిలో నవీన్ యాదవ్ పేరును కాంగ్రేస్ ఖరారు చేసింది. గడచిన ఎన్నికల్లో ఎంఐఎం తరఫున పోటీ చేసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ రంగు ఎత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంఐఎం వైఖరిలో మార్పు కనిపిస్తోంది. బీఆర్ఎస్ మద్దతుదారు నుంచి కాంగ్రెస్ పట్ల సైలెంట్ మిత్రుడిగా వ్యవహరిస్తోంది.
దీంతో ఈ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంఐఎం స్వతంత్రంగా పోటీ చేస్తే అది బీజేపీకి ప్లస్ అవుతుందని అంచనా వేస్తోంది. ఈ కారణంగానే ఎంఐఎం పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతు పలకడం ఖాయమని అంచనాలు ఊపందుకున్నాయి. ఎంఐఎం ఈ సీటులో ప్రత్యక్ష పోటీకి దిగుతుందా? లేక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తుందా? అన్నదానిపై పార్టీ నాయకత్వం త్వరలోనే అధికారికంగా స్పందించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఐఎం కాంగ్రెస్ పక్షాన నిలబడుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపనుంది అనడంలో సందేహం లేదు.