
తన సినిమా కోసం ఒక దర్శకుడు ఎంత తపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అరి' చిత్రం కోసం దర్శకుడు జయశంకర్ ఏకంగా ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఈ కథను సిద్ధం చేసుకోవడానికి హిమాలయాలు, ఆధ్యాత్మిక ఆశ్రమాలు చుట్టూ తిరిగారు. అరి షడ్వర్గాల కాన్సెప్ట్పై లోతైన పట్టు సాధించి, వెండితెరపైకి ఇంతవరకు రాని ఒక వినూత్న కథాంశాన్ని మూడేళ్ల పాటు కష్టపడి రాసుకున్నారు.
ఏడేళ్ల ప్రయాణం.. బ్యాక్ బోన్ను కోల్పోయిన దర్శకుడు
నాలుగేళ్ల నిర్మాణ కష్టంతో పాటు ఏడేళ్ల పరిశోధనతో రూపొందిన 'అరి' మూవీ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సుదీర్ఘ ప్రయాణంలో జయశంకర్ తన జీవితంలో అత్యంత కీలకమైన ఇద్దరు వ్యక్తులను కోల్పోయారట: వారు ఆయనకు వెన్నెముకగా నిలిచిన తండ్రి వంగ కనకయ్య మరియు బావ కె.వి. రావు.
వారి జ్ఞాపకార్థం, జయశంకర్ తాజాగా వేసిన భావోద్వేగ పోస్ట్ అందరి మనసులను కదిలించింది.
జయశంకర్ ఎమోషనల్ పోస్ట్ సారాంశం
"రేపటి నుంచి 'అరి' ఇక ఆడియెన్స్ సొంతం. ఈ మూవీ నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకమైనది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా జీవితానికి మూల స్తంభాలైన మా తండ్రి గారు (వంగ కనకయ్య), బావ గారు (కె.వి. రావు) మరణించారు. నేను వారిద్దరినీ కోల్పోయాను. 'అరి' చిత్రంలోని ప్రతి ఫ్రేమ్పై వారి ఆశీస్సులు ఉంటాయి. ఈ సినిమాను నేను ఆ ఇద్దరికీ అంకితం చేస్తున్నాను." అరి మూవీ డైరెక్టర్ చేసిన కామెంట్లను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు