కెసిఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్దన్నలా ఉన్నారు. ఆయనకు ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది. అంతకు ముందు మంత్రిగా పనిచేశారు. దీంతో పాటు ఉద్యమాన్ని నడిపిన అనుభవం ఉంది. ఇంత అనుభవం ఉన్నది.
ఇప్పుడు కెసిఆర్ కు వైఎస్ జగన్ మంచి దోస్త్ అయ్యాడు. ముఖ్యమంత్రిగా అనుభవం లేదు. చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడంతో జగన్, అనుభవజ్ఞుడైన కెసిఆర్ సలహాలు సూచనలు తీసుకొని ముందుకు నడుస్తున్నాడు.
సలహాలు తీసుకుంటున్నా తన పంధాలో జగన్ దూసుకుపోతున్నాడు. ఎక్కడా బద్దకాన్ని చూపించడం లేదు. అలసట చెందినట్టుగా కనిపించడం లేదు. అయితే, రీసెంట్ గా కెసిఆర్ ఓ మాట అన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు నీరు అందిస్తాము. ప్రతి ఎకరానికి నీరు అందుతుంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ప్రకటించారు.
కెసిఆర్ తెలంగాణా రాష్ట్రం వరకు సరే.. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా చొరవ తీసుకొని ఇలా మాట్లాడటం వైరల్ గా మారింది. ఈ మాట మాట్లాడినపుడు జగన్ పక్కన ఉంటె సరే.. లేదా రెండు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమక్షంలోను అధికారుల సామసుఖంలో ఉంటె బాగుండేది.