సాధారణంగా మనం భోజనం చేసిన తర్వాత తాంబూలాలు కొంతమంది డైజీషన్ కావడం లేదని కూల్ డ్రింగ్స్ మరి కొంత మంది ధూమ పానం లాంటివి చేస్తారు. కానీ ఇవి చేయడం వల్ల చాలా హాని పొంచి ఉన్న సంగతి ఎవరికి తెలుసు. సాధారణంగా భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు నిలబడి ఉండటం మంచిది. లేదా అటూ ఇటూ నడుస్తు ఉండటం మంచిది.


మనం తినే బోజనం


మనం భోజనం చేసిన తర్వాత ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు

ధూమపానము చేయరాదు భోజనము చేసినతరువాత ఒక cigarette. కాల్చితే పది cigarettesకు సమానము అని
చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.

పళ్ళు తినకూడదు. భోజనము చేసిన తరువాత, పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ తరువాతగాని తింటే మంచిది.

టీ తాగకూడదు. టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.

 స్నానం చేయకూడదు. భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి

పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.

నిద్ర పోకూడదు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది


మరింత సమాచారం తెలుసుకోండి: