ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటికే సూపర్ 4 లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కూడా పాకిస్థాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ అవకాశాలను ఎంతో సంక్లిష్టంగా మార్చుకుంది టీమిండియా. ఇక శ్రీలంకతో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో కూడా అదే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే టీమిండియా ఓడిపోవడానికి అటు జట్టులోని ఆటగాళ్ల వైఫల్యం మాత్రమే కాదు చేసిన కొన్ని తప్పిదాలు కూడా కారణం అని చెప్పాలి. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం శ్రీలంక ముందు మంచి టాబ్లెట్ ఉంచినప్పటికీ శ్రీలంక బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో భారత బౌలింగ్ విభాగంలో మొత్తం విఫలమయ్యింది. ఇక బౌలింగ్ విభాగం కాస్త బాగా రాణించి ఉంటే టీమిండియాకు విజయం వరించేది  అన్నది ప్రస్తుతం అందరూ అనుకుంటున్న మాట.



 అయితే అర్ష దీప్ చేసిన చిన్న తప్పిదం కూడా టీమిండియా ఓటమి కారణమైంది టాక్ వినిపిస్తోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తీవ్ర ఒత్తిడి మధ్య చివరి ఓవర్లో అర్ష దీప్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి. అయిదో బంతికి రిషబ్ పంత్  వికెట్లను త్రో విసిరాడు బంతి మిస్ అయ్యి అర్ష దీప్ చేతుల్లోకి  వచ్చింది. అయితే అర్ష దీప్ కూడా తొందరపాటులో మరోసారి త్రో విసిరాడు అని చెప్పాలి. రిషబ్ పంత్ విసిరిన త్రో బాల్ అర్ష దీప్ చేతుల్లోకి వచ్చిన సమయంలో అతను కాస్త ఆగి ఉంటే మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్లేదని అప్పుడు టై అయ్యే అవకాశాలు కూడా ఉండేవని ప్రస్తుతం ఎంతో మంది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీలంక చేతిలో ఓటమి తో టీమిండియా ఇక ఇంటి దారి పట్టినట్లే అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: