ఒకానొక యువతి మొగదోసిళ్ళ నోము పట్టినది. వ్రతము పూర్తి చేయకుండానే ఆమె యింటిలో తగవులాడి బావిలోపడి చనిపోయినది. ఆ కారణమున ఆమె యింకో దేశమున శ్రీమంతుల యింటబుట్టినది. కాని ఆమె తల్లి పురిటిదినములలో చనిపోయినందున తండ్రి మరియొక వివాహమాడెను. మారుతల్లి ఆమెను నానా బాధలు పెట్టుచుండగ పార్వతిదేవి యొకదినమున ప్రత్యక్షమై చిన్నదానా! పోయిన జన్మమున నీవు మొగదోసిళ్ళ నోము పట్టి ఉద్యాపనము తీరకుండగనే మరణించిన కారణమున నీకిన్ని చిక్కులు కలిగినవని చెప్పగ ఆమె మేనమామ యింటికిపోయి, మొగదోసిళ్ళ నోము సక్రమముగ నోచికొనినంతనే మారుతల్లియ