ఈ పర్యటనకు సంబంధించి సబ్ మెరైన్ లలో తీసుకెళ్లడం ద్వారా దేశ పర్యటనలో ఇదే మొదటిసారి ప్రభుత్వం చేపడుతున్నదని చెప్పవచ్చు. అయితే ఇది అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ద్వారకా నగర కట్టడాలను పురాతన ఆలయాలను చూసేందుకు సబ్ మెరైన్ ఉపయోగించి భక్తులు చూడవచ్చని గుజరాత్ ప్రభుత్వం తెలియజేసింది.. ఇందు కోసం రెండు గంటల దర్శనం యాత్రను కూడా నిర్వహించబోతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇందుకు సంబంధించి.. మజ్ గావ్ డాక్ షిప్ యార్డ్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకుందట.
రెండు గంటలపాటు సబ్ మెరైన్ యాత్ర ఉండబోతోందని తెలియజేశారు. ఈ ట్రిప్పులో 24 మంది పర్యటకులకు ఈ సబ్ మెరైన్ లో తీసుకువెళ్తారని గుజరాత్ ప్రభుత్వ టూరిజం శాఖ తెలియజేసింది. ఇందులో ఆరుగురు సిబ్బంది ఉంటారని ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలియజేయడం జరిగింది. దీంతో శ్రీకృష్ణుని అభిమానులు సైతం ఇక మీదట ద్వారకా నగరాన్ని చూడవచ్చు అంటూ చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణునికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా మరింత క్షుణ్ణంగా పరిశీలించవచ్చు అంటూ మరి కొంతమంది పరిశోధకులు తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ టూరిజం సైతం ప్రారంభించే విధంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి