భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే.  కాశ్మీర్లోని పెహల్గాంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన అటాక్ భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేనిది.  దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై అటాక్ చేయించారు . అనుకున్న విధంగానే తొమ్మిది స్థావరాలపై అటాక్ చేయించి ఉగ్రస్ధావరాలను  మట్టిలో కలిపేశారు . అయితే పాకిస్తాన్ మాత్రం దానిపై దొంగ ప్రచారం చేస్తూ ఇండియా ..కామన్ పాకిస్తాన్ పీపుల్స్ ని చంపేసింది అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ భారత్ పై కక్ష తీర్చుకునేందుకు రకరకాలుగా ట్రై చేస్తుంది .


ఇప్పుడు పాకిస్తాన్ భారత్ ల మధ్య పరిస్థితి చాలా చాలా హాట్ గా మారిపోయింది.  అయితే పాకిస్తాన్ పంపే మిస్సైల్స్ ని..డృఓన్స్  ను గాల్లోనే తిప్పి కొడుతుంది ఇండియన్ ఆర్మీ.  తిండి నిద్ర లేకుండా 24/7 భారత్ ఆర్మీ భారత ప్రజల కోసం భారత ప్రజలకు క్షేమంగా ఉండడం కోసం కష్టపడుతుంది . కాగా ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ లో మాత్రం సీన్ వేరేలా ఉంది . పాకిస్తాన్ లో సామాన్య ప్రజల పరిస్థితి చాలా చాలా దారుణంగా మారిపోయింది . ఇదే  సమయంలో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు మొత్తం పూర్తిగా కుప్పకూలాయి . అక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది . అత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి.



మరీ ముఖ్యంగా చికెన్ - పాల ధరలు అయితే తారస్థాయికి చేరుకున్నాయి . పాకిస్తాన్ లో చికెన్ ధరలు ప్రస్తుతం ఆసక్తికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి . మరీ ముఖ్యంగా కొన్ని ప్లేసెస్ లో చికెన్ ధర వెయ్యి రూపాయలు దాటేసింది.  ఒకవైపు ఆర్థిక సంక్షోభం ద్రవయోల్పణం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి అంటూ లభోధిబో అని పాకిస్తానీలు అల్లాడిపోతున్నారు . కాగా పాకిస్తాన్ లో ఇప్పుడు కేజీ చికెన్ ధర దాదాపు 900 కు పైగానే ఉంది.  అదే బోన్లెస్ చికెన్ అయితే 1200 దాటేసింది .



పౌల్ట్రీ వ్యాపారులు మూతపడడం ప్రధాన కారణం అని తెలుస్తుంది.  అంతేకాదు కోళ్ల దానాకు తీవ్ర కొరత ఏర్పడడంతో కూడా ఈ వ్యాపారం చాలామంది నిలిపివేశారు.  దీంతో పాకిస్తాన్ ప్రజలకు ఇప్పుడు చికెన్ దొరకడం మరింత కష్టమైపోయింది. అయితే దీని పట్ల సోషల్ మీడియాలో రకరకాల మీమ్‌స్ ట్రెండ్ అవుతున్నాయి . పక్కనోడి లైఫ్ను నాశనం చేయాలని చూస్తే మీ లైఫ్ మీరే నాశనం చేసుకుంటారు ..దానికి ఇదే బిగ్ ఎగ్జామ్పుల్ . సైలెంట్ గా ఉన్న ఇండియాను గెలికారు ఇప్పుడు మీ దేశాన్ని మీరే చీదురించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు అంటూ ఘాటుగాటుగా మీమ్‌స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ పాకిస్ధానీలు ఏం తిని బ్రతుకుతారో..?? అంటూ వెటకారంగా కూడా కౌంటర్స్ పడుతున్నాయ్..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: