రేషన్ కార్డులనేవి ఒక కుటుంబానికి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్. రేషన్ కార్డు లేకుంటే ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందవు. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎలాగో రేషన్ కార్డు కూడా అంతే ముఖ్యం. రేషన్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహస్తోంది.అసలు ఎలాంటి అర్హత లేకుండా రేషన్‌ కార్డులు పొందుతూ ఉచితంగా రేషన్‌ తీసుకుంటున్నవారిపై ప్రత్యేక నిఘా పెంచింది కేంద్ర ప్రభుత్వం.అందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక రకాల చర్యలు చేపడుతున్నాయి. రేషన్‌కార్డుదారుల పొరపాటు వల్ల మొత్తం 80 వేల కార్డులు రద్దయ్యాయి. నిజానికి కార్డుదారులు ఆరు నెలల పాటు నిరంతరం రేషన్ కనుక తీసుకోకపోతే అతని పేరును ప్రభుత్వం జాబితా నుండి తొలగిస్తుంది. దాని స్థానంలో మరో నిరుపేద వ్యక్తికి రేషన్‌కార్డుని తయారు జారీ చేస్తారు.


ఇక గోవా ప్రభుత్వం అయితే ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారి రేషన్ కార్డును రద్దు చేసింది. ఈ కార్డ్ హోల్డర్లు ఆగస్టు 2022 నుండి జనవరి 2023 దాకా తమ రేషన్ తీసుకోలేదు. రేషన్ తీసుకోని కార్డుదారుల కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలు ఇంకా అలాగే వినియోగదారుల వ్యవహారాల డైరెక్టర్ గోపాల్ పర్సేకర్ తెలిపారు. దీనితో పాటు ఇంత పెద్ద సంఖ్యలో కార్డుదారులు రేషన్ ఎందుకు తీసుకోలేదో కూడా డిపార్ట్‌మెంట్ విచారణ చేస్తోందని ఆయన చెప్పారు.ఇక రాష్ట్రంలో మొత్తం 13.32 లక్షల మంది రేషన్ కార్డుదారులున్నారు. వీరిలో మొత్తం 80 వేల మంది రేషన్ కార్డుదారులకు రేషన్ తీసుకోకపోవడం పెద్ద విషయమే అయినా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది ఎందుకు రేషన్ తీసుకోలేదని శాఖాపరంగా విచారణ అనేది జరుగుతోంది. తమ సమ్మతి ఆధారంగా కార్డును రద్దు చేయాలని అభ్యర్థించిన వారు తమ కార్డును మళ్లీ జారీ చేసుకోవచ్చని కూడా పర్సేకర్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: