జ‌నసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ పై ఫైర్ అయ్యారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌పై భీమ‌వ‌రం నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. తాజాగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అంబేద్క‌ర్ విగ్ర‌హం కొంద‌రు ధ్వంసం చేయ‌డంతో గ్రంధి ఇదంతా జ‌న‌సేన అభిమానుల ప‌నే అని విమ‌ర్శ‌లు చేయ‌డంతో పాటు ప‌వ‌న్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా చేశారు. దీంతో ప‌వ‌న్ గ్రంధి శ్రీనివాస్‌పై విరుచుకు ప‌డ్డారు.

గ్రంధి ఒక ఆకు రౌడీ అని, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అని పవన్ మండి పడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గ్రంధి శ్రీనివాస్ ఆగడాలను అడ్డుకోవాలని పవన్ డీజీపి గౌతం సవాంగ్ కు సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: