అధికారం మారినప్పుడు నేతలు కూడా పార్టీలు మారుతుంటారు. చాలా మంది తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీలు మారితే.. ఇంకొందరు తమ వ్యాపారాలకు ఇబ్బందులు రాకుండా పార్టీలు మారుతుంటారు.అయితే.. జగన్ అధికారంలోకి రాగానే కొందరిని బ్లాక్ మెయిల్ చేసి పార్టీ మార్పించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మైనింగ్ వ్యాపారంలో ఉన్న మాజీ మంత్రి  శిద్ధా రాఘవరావును బెదింరించి పార్టీ మారేలా చేశారని టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు వైసీపీ కార్యకర్తలే నాయకుల తీరుపట్ల సంతృప్తిగా లేక తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందని నల్లారి అంటున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి  ఆరోపించారు. ఇరువురూ ఓవైపు మైనింగ్ మాఫియా మరో వైపు భూ కబ్జాలు, ఇంకోవైపు లిక్కర్ మాఫియా విచ్చలవిడిగా సాగిస్తున్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ యజమానులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: