టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే.. హెలికాప్టర్ రాకుండా ప్రభుత్వం కుట్ర చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సర్కారు కుట్ర చేసినా మీ కోసం రోడ్డుమార్గాన ఇక్కడికి వచ్చానని బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఆనాడు రైతుల కోసం కల్లాల్లోకి కాంగ్రెస్ అంటూ బిక్నూర్ కు వచ్చి మీ కోసం కొట్లాడానని.. వడగండ్ల వానపడితే కేసీఆర్ రాలేదు... రైతు గుండె ఆగి చనిపోతే చూడనీకి రాలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు.


మాచారెడ్డి రైతు లింబయ్య సచివాలయం ముందు ఉరేసుకుని చనిపోతే కేసీఆర్ ఆదుకోలేదని.. కానీ కాంగ్రెస్ లక్ష రూపాయలు ఇచ్చి లింబయ్య కుటుంబానికి భరోసా ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడకు రాని కేసీఆర్...ఇవాళ సిగ్గులేకుండా ఓట్లు అడగడానికి వస్తుండని రేవంత్ రెడ్డి అన్నారు. 40 ఏళ్లుగా వివిధ పదవుల్లో ఉన్న కేసీఆర్ కు కొనాపూర్ గుర్తురాలేదని.. కానీ ఓట్ల కోసం కొనాపూర్ బిడ్డనంటూ ఇక్కడికి వస్తుండని రేవంత్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: