కరోనా వైరస్ కాలంలో డాక్టర్లు ప్రత్యక్ష దైవాలు గా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎంతో మంది వైద్యులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రజల ప్రాణాలను రక్షించుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. కాని కొంత మంది వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. డాక్టర్ చికిత్స చేస్తున్న సమయంలో మహిళ మృతి చెందింది. ఇక ఈ ఘటన కాస్త సంచలనంగా మారగా పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే మనస్థాపం చెందిన డాక్టర్ బలవన్మరణానికి పాల్పడింది. రాజస్థాన్ లోని దౌవా జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.



 వివరాల్లోకి వెళితే.. జిల్లాలో  ఉండే అర్చన శర్మ ఆమె భర్తతో కలిసి  ఓ ప్రైవేట్ ఆస్పత్రి నడుపుతున్నారు. కాగా డాక్టర్ అర్చన సిజేరియన్ గా చేస్తూ ఉంది. అయితే ఇటీవల సీరియల్ చేస్తున్న సమయంలో ఓ గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమెకేసు నమోదైంది. ఇక ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన వైద్యురాలు  ఆసుపత్రిపై ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.


 ఇలా ఆత్మహత్యకు ముందు తన బలవన్మరణానికి కారణం ఏంటి అన్న విషయాన్ని సూసైడ్ నోట్లో రాసింది అర్చన. ఈ క్రమంలోనే ఈ ఘటన సంచలనం గా మారిపోయింది. కేసులో ఉన్న సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకొని ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. నిందితులను విడిచిపెట్టబోము అంటూ స్పష్టం చేశారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి వైద్యులు సాయశక్తులా ప్రయత్నిస్తారు.. కానీ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వైద్యులను నిందించడం సమంజసం కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు ఆయన..

మరింత సమాచారం తెలుసుకోండి: