ఇక హాస్టల్ పరిసరాలకు అసలు ఇమడలేకపోయింది. అదే సమయంలో చదువు ఒత్తిడి కూడా తట్టుకోలేకపోయింది. చివరికి మనస్థాపం చెంది కఠిన నిర్ణయం తీసుకుంది. కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తొట్టంబేడు మండలం కారకొల్లు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె చైతన్య నెల్లూరు లోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంటు చదువును కొనసాగిస్తుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉండడంతో ఎంతగానో కుంగిపోయింది చైతన్య. హాస్టల్లో అసలు ఉండలేనంటూ పలుమార్లు తండ్రికి ఫోన్ చేసి కూడా చెప్పింది. కానీ కొన్ని రోజులు అలాగే ఉంటుందమ్మా పర్వాలేదు అక్కడే ఉండి చదువుకో అంటూ తండ్రి చెప్పాడు.
ఇకపోతే ఇటీవలే నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో గడిపేందుకు చైతన్య ఇంటికి వచ్చింది. ఇక మళ్లీ హాస్టల్ కి వెళ్ళను అంటూ తల్లిదండ్రులకు చెప్పింది. కానీ తల్లిదండ్రులు మళ్లీ సర్ది చెప్పి పంపించారు. దీంతో మనస్తాపం చెందిన చైతన్య శివ నాద పాలెం వద్ద తెలుగుగంగ కాలువ ఒడ్డున సెల్ ఫోన్ పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక స్థానికులు సెల్ఫోన్ గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహం మరునాడు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.