
ఈ యూనిట్లో 16-20 కోచ్లతో కూడిన కొత్త తరం మెము రైళ్లను తయారు చేయనున్నారు. ఈ రైళ్లు గ్రామీణ, అర్ధ-నగర ప్రాంతాల్లో స్వల్ప, మధ్య దూర ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటాయి. ముఖ్యంగా పండుగ సీజన్లో ఈ రైళ్లు రద్దీని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది. 2023 జులైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊపిరి లభిస్తుంది.
కాజీపేట యూనిట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాల భూమిని సమకూర్చగా, మిగిలిన 10 ఎకరాల సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ యూనిట్ ఆధునిక సాంకేతికతతో నిర్మితమవుతూ, రోబోటిక్ పెయింటింగ్, అత్యాధునిక యంత్రాలు, మెటీరియల్ హ్యాండ్లింగ్ సౌకర్యాలను కలిగి ఉంటుంది. ఈ యూనిట్ రైళ్ల తయారీతోపాటు నిర్వహణ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ ప్రాజెక్టు భారత రైల్వేల ఆధునీకరణలో భాగంగా, స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి బలం చేకూరుస్తుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు