ఇండియన్
ఆర్మీ 2020, జనవరిలో మొదలవ్వనున్న
130 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో
ప్రవేశాలకు అవివాహితులైన
పురషు అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ
నోటిఫికేషన్ లో భాగంగా. ఈ కోర్సుకు ఎంపికైన
అభ్యర్థులకు డెహ్రాడూన్లోని ఇండియన్
మిలటరీలో ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.ఆ తరువాత సర్వీస్ లోకి తీసుకుంటారు.
ఖాళీలు: 40 (సివిల్-10, ఆర్కిటెక్చర్-1, మెకానికల్-6, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్
ఎలక్ట్రానిక్స్- 6; కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/కంప్యూటర్
టెక్నాలజీ/ఐటీ-8; ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/టెలి కమ్యూనికేషన్/
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/శాటిలైట్ కమ్యూనికేషన్-5; ఎలక్ట్రానిక్స్-1, మెటలర్జికల్-1, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్-1; మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్
మైక్రోవే వ్-1.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్
డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారూ
దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట శారీరక , వైద్య ప్రమాణాలుండాలి.
వయసు: 2020, జనవరి 1 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: విద్యార్హత మార్కులు, స్టేజ్-1,2 ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, శారీరక, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక
చేస్తారు.
దరఖాస్తుకు చివరితేదీ: మే 9, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.joinindianarmy.nic.in