
ప్రశాంతత, ఆహ్లాదకరమైన మానసిక స్థితిని అందించడంలో మల్లెపూలు ఏవీ సాటిరావని చెప్పవచ్చు. మల్లెపువ్వులు జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి, కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. కొంతమంది వీటితో తయారు చేసిన టీని సైతం తాగుతారు. ఈ టీ సాధారణంగా భోజనం తర్వాత జీర్ణక్రియకు సహాయపడటానికి తీసుకోవడం జరుగుతుంది.
మల్లె నూనెతో మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభించే ఛాన్స్ ఐతే ఉంటుంది. తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గించడానికి కూడా మల్లెపూలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడతాయి. మల్లె నూనె చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. మల్లె నూనెని మాయిశ్చరైజర్గా కూడా ఉపయోగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మల్లె నూనె జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
చుండ్రు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. మల్లెపూలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మల్లె టీ తాగడం మంచిదని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
మల్లె పువ్వుల కషాయాన్ని ఉపయోగించి నోటిని కడగడం వల్ల దంతాల నొప్పి నుండి ఉపశమనం లభించే ఛాన్స్ ఐతే ఉంటుంది. మల్లెపూలతో చేసిన కషాయాన్ని కళ్ళపై వేసుకుంటే కంటి మంటలు, నొప్పులు సులువుగా తగ్గుతాయి. మల్లెపూలను సరైన విధంగా వినియోగిస్తే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.