సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది దర్శకులు ఎన్నో ఆశలతో వస్తారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. అలాంటి అతి తక్కువ మందిలో ఒకరే డైరెక్టర్ దేవా కట్టా. టాలీవుడ్ కి వెన్నెల అనే సినిమాతో పరిచయమయ్యారు. ఇది చిన్న సినిమా కావడంతో పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కొద్ది గ్యాప్ తరువాత ప్రస్థానం అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా దేవా కట్టాకి దర్శకుడిగా మంచి పేరును తీసుకువచ్చింది. ఈ సినిమాలో కథ మరియు స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రత్యేకంగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో సాయి కుమార్ సన్నివేశాలలో వచ్చే ప్రతీ డైలాగ్ ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో హీరోగా శర్వానంద్ నటించినప్పటికీ ఫుల్ క్రెడిట్ మాత్రం సాయి కుమార్ మరియు డైరెక్టర్ లకే దక్కింది.

సినిమా విజయం తరువాత అక్కినేని నాగచైతన్యతో తీసిన "ఆటోనగర్ సూర్య" మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయినా డైరెక్టర్ కి మంచి పేరు తీసుకువచ్చింది. తర్వాత దేవా చేసిన రీమేక్ సినిమా డైనమైట్ మరియు హిందీలో చేసిన ప్రస్థానం రెండూ ప్లాప్ అవడంతో కొంతకాలం కామ్ గా ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఫ్రెష్ గా మెగా హీరో సుప్రీమ్ స్టార్ సాయి తేజ్ తో "రిపబ్లిక్" సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఇందులో సాయి తేజ్ ఒక ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు మరియు రమ్యకృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొట్ట మొదటిసారి సాయి తేజ్ కి జంటగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండడం గమనార్హం.

ఈ సినిమాకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్ర యూనిట్ అంతా కూడా సినిమా విజయంపై మంచి నమ్మకంతో ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈ రోజు డైరెక్టర్ దేవా కట్టా తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ టీం అంతా దేవా కు బర్త్ డే విషెస్ చెప్పడం జరిగింది. ఇంతకు ముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, రాజశేఖర్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు ల మధ్య ఉన్న వైరం నేపథ్యంలో  ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా దేవా చెప్పారు. దానికి టైటిల్ కూడా "ఇంద్రప్రస్థం" అని డిసైడ్ అయ్యారని టాక్. ఈ రెండు సినిమాలతో మళ్ళీ దేవా కట్టా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ? అన్నది తెలియాల్సి ఉంది.


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: