బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, కాజోల్ కలిసి నటిస్తున్నారు అంటే ఆ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోతాయి దానికి ప్రధాన కారణం వీరిద్దరి కలయికలో ఇదివరకు వచ్చిన సినిమాలే అని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి అనేక సినిమాలలో నటించారు అందులో దిల్ వాలే దుల్హనియా లేజాయింగే,  కుచ్ కుచ్ హోతా హై, కబీ ఖుషి కబీ గామ్, సినిమాలు మంచి విజయాలుగా నిలిచాయి, మరీ ముఖ్యంగా దిల్ వాలే దుల్హనియా వీరిద్దరికి మాత్రమే కాకుండా హిందీ సినీ చరిత్రలోనే ఒక గొప్ప సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమా పోయిన సంవత్సరమే 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా వీరిద్దరి కలయికలో మరొక సినిమా రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో షారుక్ ఖాన్ కాజోల్ హీరో హీరోయిన్ గా విద్యాబాలన్, తాప్సీ , మనోజ్ బాజ్ పాయి, మరియు బొమ్మన్ ఇరాణి ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఎక్కువగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి ఇష్టపడుతుంటారు.


ఇప్పటికే ఈ దర్శకుడు మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే, లాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశాడు. ప్రస్తుతం కూడా ఈ దర్శకుడు ఇలాంటి కథనే సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా సోషల్ కామెడీ నేపథ్యంలో నడుస్తుంది అని బాలీవుడ్  కథనాల ప్రకారం తెలుస్తోంది. కాజోల్ ఈ సినిమాలో షారుక్ ఖాన్ కి భార్య గా నటిస్తున్నట్టు. మరియు విద్యాబాలన్ ,తాప్సీ ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించే పోతున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటే మనోజ్ బాజ్ పాయ్, బొమ్మన్ ఇరాణి లు కూడా మంచి పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: