అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె రెండో కూతురు ఖుషి కపూర్ కూడా త్వరలోనే బీటౌన్ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల కాలంలో ఖుషి కపూర్ అందాల ప్రదర్శన బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇటీవల కాలంలో లో మన అందరి ప్రదర్శన తన అక్క జాన్వీకపూర్ ను మించిపోయింది. గత కొంత కాలంగా జాన్వి కపూర్ కూడా వరుసగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్ లో రచ్చ రచ్చ చేసింది. కరోనా ఈ సమయంలో యూత్ కు హాట్ ట్రీట్ తో నాయనానందం కలిగించింది. జాన్వీ కపూర్ అంతగా రెచ్చి పోవడం తో శ్రీదేవి అభిమానులు షాక్ అయ్యారు. చాలామంది ఆమెపై ట్రోలింగ్ కూడా చేశారు. దీంతో ఇటీవల కాలంలో జాన్వి కాస్త సైలెంట్ అయింది. శ్రీదేవి అభిమానులు కొంతమేర శాంతించారు.

జాన్వీ కపూర్ అలా వెనక్కి తగ్గిందో లేదో ఖుషి మొదలెట్టేసింది. తాజాగా ఖుషి కపూర్ వాష్ రూమ్ లో దిగిన పిక్ షేర్ చేసింది. పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పిక్ ని చూసిన నెటిజన్లు అక్కకు తగ్గ చెల్లి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే ఖుషి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ జరిగే అవకాశం ఉంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఇంత గ్లామర్ ఒలకబోస్తున్న ఖుషి వెండితెరపై ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి. ఖుషి కేవలం గ్లామర్ షో కే పరిమితమై పోతుందా? లేదంటే నటనతో కూడా ఆకట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ అందరూ దాదాపుగా సినిమా వైపే మొగ్గు చూపుతున్నారు. త్వరలోనే మూవీ ఎంట్రీ ఇచ్చేవారి జాబితాలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఉంది. ఈమె కూడా స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా హాట్ ఫొటోలతో నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: