పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఫుల్‌ స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్‌తో బిజీ అవుతున్నాడు. అయితే వీటిల్లోనూ ఎక్కువగా రీమేక్స్‌కే సైన్‌ చేస్తున్నాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఇప్పటికే రెండు రీమేకులకి సైన్‌ చేసిన పవన్‌ కళ్యాణ్‌ లేటెస్ట్‌గా తమిళ్‌ హిట్‌ 'వినోదయ సిత్తమ్' అనే సినిమాని రీమేక్‌ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. తమిళ్ లో సముద్రఖని డైరెక్ట్ చేసి హీరోగా నటించిన సినిమా 'వినోదయ సిత్తమ్'. ఈ సినిమాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైలాగ్‌ వెర్షన్‌ మొదలుపెట్టాడని తెలుస్తోంది. త్రివిక్రమ్‌ హోమ్‌ బ్యానర్ ఫార్చ్యూన్‌ ఫోర్, రామ్‌ తాళ్లూరి ఎస్.ఆర్.టి. బ్యానర్లు ఈ రీమేక్‌ని సంయుక్తంగా నిర్మిస్తాయని తెలుస్తోంది. ఇక ఒరిజినల్‌ మూవీని డైరెక్ట్ చేసిన సముద్రఖని దర్శకత్వంలోనే ఈ రీమేక్‌ తెరకెక్కబోతోందట.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'భీమ్లానాయక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 25న 'భీమ్లానాయక్' బరిలో దిగుతున్నాడు. ఇక ఈ సినిమా మళయాళీ హిట్‌ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా వస్తోంది. అలాగే పవన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన 'వకీల్‌సాబ్' హిందీ హిట్‌ 'పింక్' రీమేక్‌గా తెరకెక్కింది.

ఇక చిరంజీవి స్టోరీ సెలక్షన్‌లో చాలా జాగ్రత్త వహిస్తాడు. మాస్, యూత్, ఫ్యామిలీ ఇలా అందరికీ కనెక్ట్ అయ్యే కథలకే సైన్‌ చేస్తుంటాడు. ఈ థింకింగ్‌తోనే ప్రూవ్డ్ సబ్జెక్ట్స్‌కి సైన్ చేస్తున్నాడు. తమిళ్, మళయాళంలో హిట్‌ అయిన కథలని రీమేక్ చేస్తున్నాడు చిరు. తమిళ్‌ హిట్‌ 'కత్తి'ని 'ఖైదీ నం.150' గా రీమేక్‌ చేసి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఇక ఈ సినిమా హిట్‌తో చిరు, మరో రెండు రీమేక్స్‌ని లైన్‌లో పెట్టాడు. చిరంజీవి ప్రస్తుతం మోహన్‌ రాజా దర్శకత్వంలో 'గాడ్‌ఫాదర్'  అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపోందుతోన్న ఈ మూవీలో కింగ్‌మేకర్‌గా నటిస్తున్నాడు చిరు. ఇక ఈ సినిమా మలయాళీ బ్లాక్‌బస్టర్ 'లూసిఫర్‌'ని రీమేక్‌గా తెరకెక్కుతోంది. చిరంజీవి మరో తమిళ హిట్‌నీ రీమేక్‌ చేస్తున్నాడు. అజిత్‌, శివ కాంబినేషన్‌లో వచ్చిన 'వేదళం' సినిమాని 'బోళా శంకర్'గా రీమేక్‌ చేస్తున్నాడు. ఇక ఈ మూవీతో 8 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టాడు మెహర్ రమేశ్.


మరింత సమాచారం తెలుసుకోండి: