పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'భీమ్లానాయక్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 25న 'భీమ్లానాయక్' బరిలో దిగుతున్నాడు. ఇక ఈ సినిమా మళయాళీ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్గా వస్తోంది. అలాగే పవన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన 'వకీల్సాబ్' హిందీ హిట్ 'పింక్' రీమేక్గా తెరకెక్కింది.
ఇక చిరంజీవి స్టోరీ సెలక్షన్లో చాలా జాగ్రత్త వహిస్తాడు. మాస్, యూత్, ఫ్యామిలీ ఇలా అందరికీ కనెక్ట్ అయ్యే కథలకే సైన్ చేస్తుంటాడు. ఈ థింకింగ్తోనే ప్రూవ్డ్ సబ్జెక్ట్స్కి సైన్ చేస్తున్నాడు. తమిళ్, మళయాళంలో హిట్ అయిన కథలని రీమేక్ చేస్తున్నాడు చిరు. తమిళ్ హిట్ 'కత్తి'ని 'ఖైదీ నం.150' గా రీమేక్ చేసి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇక ఈ సినిమా హిట్తో చిరు, మరో రెండు రీమేక్స్ని లైన్లో పెట్టాడు. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ఫాదర్' అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రూపోందుతోన్న ఈ మూవీలో కింగ్మేకర్గా నటిస్తున్నాడు చిరు. ఇక ఈ సినిమా మలయాళీ బ్లాక్బస్టర్ 'లూసిఫర్'ని రీమేక్గా తెరకెక్కుతోంది. చిరంజీవి మరో తమిళ హిట్నీ రీమేక్ చేస్తున్నాడు. అజిత్, శివ కాంబినేషన్లో వచ్చిన 'వేదళం' సినిమాని 'బోళా శంకర్'గా రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీతో 8 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టాడు మెహర్ రమేశ్.