రాధేశ్యామ్' సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు అయితే 'U/A' సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు అని సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

గత వారం వరకూ ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు వరకు ఉందట.కానీ వారం గడిచే లోపు 20 నిమిషాలను కట్ చేసేశారట మేకర్స్.. పైగా డైరెక్టర్ ను పక్కన పెట్టి మరీ.. నిర్మాతలు ఈ కట్టింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారని తెలుస్తుంది.సినిమాలో అస్సలు బోరింగ్ ఎలిమెంట్స్ లేకుండా చూడాలని నిర్మాతలు వంశీ - ప్రమోద్ ముందు నుంచి కోరుతున్నారట.

కానీ, దర్శకుడు రాధాకృష్ణ హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ సీన్స్ ను, అలాగే హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లోని కొన్ని సీన్స్ ను చాలా డిటైల్డ్ గా రాసి మరి తెరకెక్కించాడు.ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.. ఈ పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో వచ్చే మూడు సీన్స్ లో.. రెండు సీన్స్ ను కట్ చేశారట అలాగే.. లవ్ ట్రాక్ లోని ల్యాగ్ సీన్స్ ను కూడా కట్ చేసి పడేసారని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయని వంశీ - ప్రమోద్ - ప్రసీద - భూషణ్ కుమార్ నిర్మాతలుగా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రం కోసం అదనపు బడ్జెట్ ను కూడా కేటాయించారట.. కానీ.. ఇది ఒక ప్యూర్ ప్రేమ కథ. మరి ఓ లవ్‌ స్టోరి ఇండస్ట్రీ రికార్డు కొట్టడం చాలా అరుదనే చెప్పాలి. పైగా ఇది పాన్ ఇండియా సినిమా కూడా.

అందుకే.. సినిమాలో ఏ సీన్ బోర్ కొట్టినా కానీ మొత్తం సినిమా టాక్ పైనే ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టే.. సినిమాని చాలా టైట్ గా కట్ చేశారని తెలుస్తుంది.. పైగా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎంతో ఎఫెక్టివ్ గా ఉంటాయట. అన్నట్టు 'రాధేశ్యామ్' కథ.. ఓ రియల్‌ స్టోరీ అని టాక్ నడుస్తుంది.. సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ లో.. ఓ ట్రైన్‌ 106 మంది ప్యాసింజర్లతో రోమ్‌ కి స్టార్ట్ అవుతుందట అయితే, అ ట్రైన్‌ ఓ టన్నేలోకి వెళ్లి తిరిగి బయటకు రాదు అని.. ఈ ట్రైన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథ మొదలవుతుందని సమాచారం..

అసలు ఆ ట్రైన్‌ ఏమైపోయింది ? అందులోని ప్యాసింజర్లు అస్సలు ఏమయ్యారు ? అనే మిస్టరీని ఛేదిస్తూ ప్రస్తుతం ఉంటే.. ప్లాష్ బ్యాక్ లో ఎమోషనల్ లవ్ స్టోరీతో 'రాధేశ్యామ్' ప్రేమ కథ సాగుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: