యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ 'మిర్చి' సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు .

అలా బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని పెంచుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో హీరో గా నటిస్తున్నడు.   అందులో భాగంగా ప్రభాడ్ ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్,  సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది . ఈ సినిమా లో కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతోంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు .  ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు .

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ సినిమా ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ తెలియజేశాడు. భూషణ్ కుమార్ 'ఆది పురుష్' సినిమా గురించి మాట్లాడుతూ...  ఆది పురుష్ సినిమా ప్రమోషన్ లను అక్టోబర్ నెల నుంచి ప్రారంభిం చబోతున్నట్లు అని తెలియ జేశాడు . ఇది ఇలా ఉంటే ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాకు సూచిత్ పరంపర సంగీతాన్ని సమకూరు స్తున్నాడు .  ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 12 జనవరి 2023 వ తేదిన విడుదల చేయనున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: