ప్రముఖ హీరోయిన్ శ్రియ శరన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోయిన్గా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు తమ వివాహం తర్వాత సినిమాలకు దూరం అవుతారు. మరికొంత మంది పిల్లలు పుట్టాక ఇండస్ట్రీకి దూరం అయిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ శ్రియ శరణ్ మాత్రం పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక కూడా ఇండస్ట్రీ లోనే కొనసాగుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇటీవల కాలంలో శ్రియ తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.

ఇక ఆమె భర్త అలాగే తాను అనుభవిస్తున్న లైఫ్ ను ఎంత ఎంజాయ్ చేస్తోందో అనే విషయాన్ని కూడా ఫోటోలు,  వీడియోల రూపంలో షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . ఇకపోతే తాజాగా కరోనా సమయంలో వీరికి ఒక పాప జన్మించింది. ఇక ఆ పాపను కూడా ఆమె సోషల్ మీడియాలో బాగా సెలబ్రిటీ చేయడం గమనార్హం.. ఇకపోతే విదేశాలకు చెందిన ఆండ్రూ ను వివాహం చేసుకున్న ఈమె తన కూతురుకు రాధా అంటూ ఒక హిందూ పేరును కూడా పెట్టింది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం తాజాగా శ్రీయ తన కూతురు రాధాకు చెవులు కుట్టించడం జరిగింది. ఇక ఆ ముఖ్య ఘట్టం హిందు సంప్రదాయం ప్రకారం నిర్వహించి తన ముచ్చట ను తీర్చుకుంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా చాలా క్యూట్ ఫ్యామిలీ అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చిన్నారి కూడా చాలా అందంగా ముద్దుగా కనిపిస్తూ ఉండటం మనం గమనించవచ్చు. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో తల్లి గా నటించిన శ్రీయ హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించడానికి సిద్ధమని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: