సాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రేమాయణం గురించి ఏ విషయం బయటకు వచ్చినా కూడా అది నిమిషాల వ్యవధిలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా సినీ సెలెబ్రెటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి మీడియా కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గురించిన వార్త ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా అల్లు అర్జున్ కి ఫిదా అయిపోయిన ఒక స్టార్ హీరోయిన్ అతని వెంట పడిందట. ఇష్టం లేదు అని చెప్పినా మెసేజ్లు కాల్స్ చేసిందట.


 ఆ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో బోయపాటి దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మంచి వసూళ్లు సాధించి విజయం అందుకుంది అని చెప్పాలి. ఒక ఈ సినిమాలో రకుల్, బన్నీ కెమిస్ట్రీ బాగా కుదిరింది అని చెప్పాలి. ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా రకుల్ బన్నీతో కాస్త సన్నిహితంగా ఉండడానికే ఇష్టపడిందట. ఈ క్రమంలోనే ఏదో ఒక కారణం చెప్పి బన్నీని తరచూ కలవడానికి ప్రయత్నించేదట రకుల్. ఫోన్లు మెసేజ్లు కూడా చేయడం మొదలుపెట్టిందట.


 మొహమాటంతో ముఖం మీద ఏమి చెప్పలేక అటు బన్నీ కూడా రకుల్ ను కొన్నాళ్లు భరిస్తూ వచ్చాడట. ఈ క్రమంలోనే ఓ రోజు ఫామిలీ మెంబర్స్ అందరూ కలిసినప్పుడు కూడా రకుల్ నుంచి బన్నీ కి ఫోన్ వచ్చిందట. ఇక ఆమెతో చాలాసేపు ఫోన్లో మాట్లాడడంతో బన్నీ భార్య స్నేహ రెడ్డి సీరియస్ అయిందన్న టాక్ ఉంది. ఏకంగా బన్నీ చేతులోని ఫోన్ లాక్కొని కాల్ కట్ చేశారట. ఇక అప్పటినుంచి రకుల్ పై కాస్త కోపం పెంచుకున్న స్నేహారెడ్డి ఆమె ఎక్కడ కనిపించిన  కూడా కోపంగా చూస్తూ ఉండేవారట. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ పుకారు  మాత్రం ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: