చాలా వివాదాలతో  మే 5న "ది కేరళ స్టోరీ" సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ సినిమాని నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్న నేపద్యంలో.. థియేటర్ దగ్గర భారీ బందోబస్త్ తో ఈ సినిమాని ప్రదర్శించారు. ఆ రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష నేతలు థియేటర్ ముందు బాగా నిరసనలు చేపట్టారు. అలాగే సినిమాలో కూడా చాలా వివాదాస్పద సీన్లు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.ఇక  ఈ సినిమాలో కేరళని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న రాష్ట్రంగా చూపించారని నాయకులు విమర్శిస్తున్నారు.అందుకే వెంటనే ఈ సినిమా ప్రధర్శనని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు లో అయితే ఈ సినిమా విడుదల నేపధ్యంలో స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులో బాగంగానే తమిళనాడులో కూడా ఈ సినిమాపై చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూ ని తప్పుగా చూపించారని, దీంతో ప్రజలను ఎంతగానో తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఈ సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.


ఇక ఈ సినిమాని నిషేదించాలని హై కోర్టుకి వెళ్ళిన విషయం తెలిసిందే. వీరి ఇద్దరి తరుపున వాదనలు విన్న కోర్టు.. ఈ సినిమాకి సెన్సార్ అప్రూవ్ ఇచ్చిందని. ఈ సమయంలో సినిమాని నిలిపివేయాలని కోరడం సరికాదని తీర్పు కూడా ఇచ్చింది. దీంతో.. అక్కడ సినిమా రిలీజ్ కి బాగానే లైన్ క్లియర్ అయ్యింది. ఇక సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి ఏమైనా ఉంటే నిర్మాత చూసుకుంటాడాని కూడా చెప్పుకొచ్చింది. ఇక సినిమా విషయానికి వస్తే కేరళలో తెప్పిపోయిన 32000 మంది అమ్మాయిల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తప్పిపోయిన ఆ ఆమ్మాయిలని బాలవంతగా మతం మార్పించి ఉగ్రవాదులు చేస్తున్నారు అనెల సినిమాలో సీన్లు ఉండటంతో ఈ సినిమాపై వివాదాలు రాజుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మే5న ప్రేక్షకుల ముందుకి వచ్చిన నేపధ్యంలో మరోసారి ఆందోళనలు ఎక్కువయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: