బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితమే.ఇండస్ట్రీలో దాదాపుగా మూడు దశాబ్దాలు తన అందం అభినయంతో, నటనతో ప్రేక్షకులను అలరించింది. కాజోల్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె అందానికి ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కాజోల్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ ఏదోక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది.

కాగా కాజోల్ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గణ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజోల్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ చివరగా హీరో ధనుష్ నటించిన విఐపి2 సినిమాలో నటించింది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ ఫొటోస్ ను షేర్ చేయడంతో పాటు తన సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కాజోల్ షాకింగ్ న్యూస్ తెలిపింది. అదేమిటంటే ఇకపై తాను ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికే ఉన్న అన్ని పోస్ట్లను డిలీట్ చేసింది. అయితే ఎందుకు సోషల్ మీడియా బ్రేక్ ఇచ్చారనేది చెప్పలేదు. కానీ ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్లో మునుపటి పోస్ట్లు మాత్రం ఉన్నాయి. కాజోల్ తన తాజా ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఇలా రాసింది, నా జీవితంలో చాలా కష్టతరమైన దాన్ని ఎదుర్కోబోతున్నాను అంటూ క్యాప్షన్ ను జోడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: