సంచలనం పెళ్ళాం అయితే రాం గోపాల్ వర్మ మొగుడు. ఆ రేంజ్ లో సంచలనం తో పెనవేసుకుని మరీ బతకడం రాం గోపాల్ వర్మ కి కొత్తేం కాదు. బెజవాడ లీడర్ వంగవీటి రాధా - వంగవీటి రంగా ల మీద సినిమా తీస్తున్నా అని వర్మ ప్రకటించిన సమయం నుంచే ఆ సినిమా ఒద్దు అనీ, ఆపేస్తాం అనీ, తీస్తే ఊరుకోం అనీ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఒస్తున్నాయి. సమాజం లో అలజడి సృష్టించడం కోసమే వర్మ ఈ సినిమా ని రూపొందిస్తున్నాడు అని అన్న మాటలకి గాట్టిగానే రియాక్ట్ అయిన వర్మ " అంత బాధ్యత లేకుండా నేను సినిమాలు ఎందుకు తీస్తాను ? " అంటూ ప్రశ్నిస్తున్నాడు.

 

 

 

కులాల గురించి కెలికితే ఎలాంటి దారుణాలు జరుగుతాయి అనేది తనకి బాగా తెలుసు అని చెబుతున్నాడు వర్మ. " వంగవీటి సినిమా తీయద్దు అని ఎవరన్నా చెబితే అది నాకు నాన్ సెన్స్ లాగా అనిపిస్తుంది. వంగవీటి గురించి సదరు విజయవాడ వ్యక్తి కంటే, వంగవీటి రంగా ఇంట్లో వారికంటే నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి నాకు సలహాలు ఇవ్వడం ఆపండి " అంటూ వర్మ సీరియస్ అయ్యాడు.

 

 

 

" సినిమా మొదలు కూడా కాకుండా అందులో ఏముందో ఎలా చెబుతారు ? నిజంగా అందులో ఇబ్బందికర సన్నివేశాలు ఉంటే అప్పుడు రియాక్ట్ అవ్వాలి కానీ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు " అని వర్మ చెబుతున్నాడు.  " ఏది ఎలా జరిగినా నాకు ఇష్టమైంది నేను చేసి తీరతాను, ఎవ్వరి మాటా విననూ లెక్కజేయనూ " అన్నారు వర్మ. ఈసినిమా  లో రాజీవ్ గాంధీ , ఎన్టీఆర్ లని కూడా పాత్ర ధారులు గా చేసేసి ఇక ఏ రేంజ్ లో ఈ సినిమా కి పబ్లిసిటీ సంపాదిస్తాడో వర్మకే తెలియాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: