దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది సాహో సినిమా. బాహుబలి 2 తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. శ్రధ్ధాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఆగష్ట్ 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, మేకింగ్ వీడియోలు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. 
 
హైదరాబాద్ లోని యల్ బి స్టేడియంలో ఆగష్ట్ 17న సాహో ఆడియో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఆగష్ట్ 21న కొచ్చిలో, 25న బెంగళూరులో, 27న ముంబైలో సాహో ఆడియో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో కూడా సాహో సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ సినిమాలో ఒక్క సీన్ కోసమే 70 కోట్ల రుపాయలు నిర్మాతలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు 120 కార్లను వాడినట్లు తెలుస్తుంది. 
 
నిజానికి ఆగష్ట్ 15నే సాహో సినిమా విడుదల కావాలి. కానీ ఈ సినిమాలో ముఖ్యమైన ఇసుక తుఫాను సీన్లో విజువల్ ఎఫెక్ట్స్ అనుకున్న స్థాయిలో లేకపోవటంతో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ కొంత సమయం కావాలని అడగటంతో సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా జిబ్రాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: