పెద్దగా సినిమాలు లేని శాలినీ పాండే.. ఇప్పుడు గోవాలో ఎంజాయ్ చేస్తోంది. గోవా వెళ్తే అందరూ సరదాగా సముద్రంలో స్నానం చేస్తారు.. కానీ శాలినీ పాండే వెరైటీగా.. అక్కడి ఓ రిసార్ట్ లోని బాత్ టబ్ లో స్నానం చేస్తోంది. అంతే కాదు.. చేతిలో ఓ గ్లాసు.. అందులో ద్రావకం. మరి అది మందేనా కాదో తెలియదు మరి..
అసలే బొద్దుగుమ్మ.. అందుల్లోనూ బట్టలు లేకుండా.. బాత్ రూమ్ టబ్బులో కనిపిస్తే కుర్రకారు గతేం కాదు.. అలా రెచ్చగొట్టాలనో ఏమిటోమరి.. ఆ ఫోటోను తన ఇన్స్ట్రా గ్రామ్ లో పోస్టు చేసింది. అయితే అమ్మడు బాత్ రూమ్ టబ్బులో ఉన్నా.. ఏమీ కనిపించకుండా జాగ్రత్త పడటంతో కుర్రకారు.. ఇది అన్యాయం అని కామెంట్లు పెడుతున్నారు.
శాలినీ ప్రస్తుతం తెలుగులో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న ‘నిశబ్దం’లో నటిస్తోంది. 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండకు ఏమాత్రం తగ్గకుండా నటించింది. ఆ సినిమా తర్వాత తమిళ్, తెలుగు సినిమాల్లో నటించినా రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత ‘మహానటి’, ‘118’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. పెద్దగా క్లిక్ కాలేదు. కేవలం అతిథి పాత్రలే. తమిళ్లో మాత్రం నాగచైతన్య '100 పర్సెంట్ లవ్' రీమేక్లో.. జీవా 'గోరిల్లా'.. శాలినీ పాండేకు నటించే అవకాశం వచ్చింది.
ఇటీవలే.. శాలినీ పాండేకు బాలీవుడ్ నుండి ఏకంగా మూడు సినిమాలు చేయాలనీ ఆ ఆఫర్ వచ్చాయట. బాలీవుడ్ క్రేజీ స్టార్ రణ్వీర్ సింగ్కు జోడీగా ఆమెకు అవకాశం వచ్చిందట. యశ్రాజ్ ఫిల్మ్స్ రణ్ వీర్ సింగ్తో 'జయేశ్భాయ్ జోర్దార్' అనే సినిమాను ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో రణ్ వీర్కు జంటగా శాలినీని ఎంపిక చేశారట.. అంతే కాదు.. యశ్రాజ్ ఫిల్మ్స్తో మూడు సినిమాలు చేసేలా ఆగ్రిమెంట్ కూడా చేసిందట.